Trending: వారెవ్వా వెరైటీ వెడ్డింగ్ కార్డ్.. ఏకంగా భారతమాత ఫొటోను..

by Shiva |
Trending: వారెవ్వా వెరైటీ వెడ్డింగ్ కార్డ్.. ఏకంగా భారతమాత ఫొటోను..
X

దిశ, భైంసా: స్నేహితులు, బంధుమిత్రులకు ఇచ్చే శుభలేఖలు రోజురోజుకు కొత్తపుంతలు తొక్కుతున్నాయి. శుభలేఖలు అనగానే ఒకప్పుడు తేదీ, వరుడు, వధువు, కుటుంబ సభ్యుల వివరాలు ఉండేవి. కానీ, కొందరు రొటీన్‌కు భిన్నంగా ఆలోచించి తమ అభిమానాన్ని పెళ్లి పత్రికల్లో చూపిస్తున్నారు. తాజాగా, నిర్మల్ జిల్లా కుబీర్ మండలం హాల్దా గ్రామానికి చెందిన రోహిత్ ధర్మసేన అనే యువకుడి వివాహం ఈనెల 18న జ‌ర‌గ‌నుంది. అయితే, తన పెండ్లి పత్రికపై భారతదేశ చిత్రపటంతో పాటు భారతమాత చిత్రాన్ని కూడా ముద్రించాడు. పెళ్లి కార్డులో వికసిత్ భారత్, ప్రధాని నరేంద్ర మోడీ చారిత్రాత్మక నిర్ణయాలు తెలిపే విషయాలు అందులో ప్రింట్ చేయించాడు. అదేవిధంగా బంధుమిత్రులకు ఆ శుభలేఖలను అందజేశారు. ఈ క్రమంలోనే శుభలేఖను చూసిన పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. తమ అభిమాన నాయకుడైన బండి సంజయ్‌కి సైతం శుభలేఖను అందేలా ప్రధాని కార్యాలయానికి అర్జీ పెట్టుకున్నట్లుగా వరుడు ధర్మసేన తెలిపాడు.

Advertisement

Next Story

Most Viewed