కరోనా కట్టడికి.. ఖజానా జువెల్లర్స్ భారీ విరాళం

by  |
కరోనా కట్టడికి.. ఖజానా జువెల్లర్స్ భారీ విరాళం
X

దిశ, వెబ్‌డెస్క్: కరోనా వైరస్ కట్టడిలో భాగంగా ఎంతో మంది పారిశ్రామిక వేత్తలు, వ్యాపార వేత్తలు, రాజకీయ, సినీ ప్రముఖులు తమ ఉదారత చాటుకున్నారు. పీఎం, సీఎం సహాయ నిధులకు విరాళాలను అందించి కరోనా కట్టడి చేసేందుకు తమ వంతుగా కృషి చేశారు. తాజాగా మరో ప్రముఖ వ్యాపార సంస్థ ఖజానా జువెలర్స్ భారీ విరాళాన్ని ప్రకటించింది. రాష్ట్రంలో కరోనా నివారణకు రూ.3 కోట్లు అందజేశారు. ఈ చెక్‌ను శుక్రవారం మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు చొరవతో ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌కు అందజేశారు. ఈ మొత్తాన్ని వరంగల్ ఎంజీఎం‌కు వినియోగించాలని కోరారు.



Next Story

Most Viewed