కష్టకాలంలోనూ రికార్డు స్థాయి ఎఫ్‌డీఐలు : మోడీ

by  |
కష్టకాలంలోనూ రికార్డు స్థాయి ఎఫ్‌డీఐలు  : మోడీ
X

దిశ, వెబ్ డెస్క్ :
దేశంలో పారదర్శక పన్నుల విధాన వేదికను ప్రధానిమోడీ గురువారం ప్రారంభించారు.ఆర్థిక వ్యవస్థ పునరుత్తేజానికి పన్ను సంస్కరణలు అవసరమని ఆయన వ్యాఖ్యానించారు. రానున్న రోజుల్లో పన్నుల వ్యవస్థలో మరిన్ని మార్పులు తీసుకురానున్నట్లు మోడీ తెలిపారు. నిజాయితీగా పన్ను చెల్లించేవారికి ఈ ప్రత్యేక వేదిక ఉపయోగపడుతుందని ప్రధాని అభిప్రాయం వ్యక్తం చేశారు.

దేశంలో కరోనా వ్యాప్తి వలన ఎన్ని ఇబ్బందులు తలెత్తినా.. అలాంటి పరిస్థితుల్లోనూ రికార్టు స్థాయిలో Fdiలు వచ్చాయని వెల్లడించారు. అంతేకాకుండా, సెప్టెంబర్ 25నుంచి ఫేస్‌లెస్ అప్పీల్ సేవలను ప్రారంభిస్తామని వివరించారు. ఇప్పటికే ఆదాయపన్ను, కార్పొరేట్ పన్నును తగ్గించినట్లు ఈ సందర్భంగా మోడీ గుర్తుచేశారు.


Next Story