పలువురు ఎమ్మార్వోలు బదిలీ

by  |
పలువురు ఎమ్మార్వోలు బదిలీ
X

దిశ, బెల్లంపల్లి: మంచిర్యాల జిల్లాలో పలువురు తహసీల్దార్లను, నాయబ్ తహసీల్దార్లు బదిలీ అయ్యారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ భారతి హోళీ కేరి ఉత్తర్వులను జారీ చేశారు. లక్సెట్టిపేట తహసీల్దార్ గా విధులు నిర్వహిస్తున్న పుష్పలతను జన్నారం మండలానికి, జిన్నారం మండల తసీల్దార్ గా విధులు నిర్వహిస్తున్న రాజ్ కుమార్ ను లక్సెట్టిపేట మండలానికి, చెన్నూరు మండల తహసీల్దార్ గా విధులు నిర్వహిస్తున్న సిహెచ్ రామచంద్రయ్యను కోటపల్లి మండలానికి, కోటపల్లి మండల తసీల్దార్ గా విధులు నిర్వహిస్తున్న జ్యోతిని చెన్నూరు మండలానికి, కోటపల్లి మండలంలో నాయబ్ తహసీల్దార్ గా విధులు నిర్వహిస్తున్న మునావర్ షరీఫ్ ను కన్నేపల్లి మండలానికి బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. బదిలీ అయిన తహసీల్దార్లు వారికి కేటాయించిన స్థలాల్లో వెంటనే విధుల్లోకి చేరాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.



Next Story

Most Viewed