విద్యాశాఖ మంత్రికి టీపీటీఎఫ్​ విజ్ఞప్తి

by  |
విద్యాశాఖ మంత్రికి టీపీటీఎఫ్​ విజ్ఞప్తి
X

దిశ, న్యూస్​బ్యూరో: ఉద్యోగాల్లోనుంచి తొలగిస్తుండటంతో ప్రైవేటు టీచర్లు ఆకలితో అలమటిస్తున్నారని, వారి సమస్యలను తీర్చాలని తెలంగాణ ప్రైవేట్​ టీచర్స్​ ఫోరం విజ్ఞప్తి చేసింది. కొడంగల్ నియోజకవర్గ పర్యటనలో ఉన్న విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డిని కలిసి టీపీటీఎఫ్​ కొడంగల్, వికారాబాద్ జిల్లా కమిటి సభ్యులు తమ గోడును తెలియజేశారు. అనేకసార్లు ఫోరం రాష్ట్ర సభ్యులు మంత్రిని నేరుగా కలిసి సమస్యలు విన్నవించినా పట్టించుకోవడంలేదని వాపోయారు. నాలుగు నెలలుగా ప్రైవేట్​ టీచర్ల కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయని తెలిపారు. ఇప్పటికైనా స్పందించి ప్రభుత్వం తమ సమస్యలను పరిష్కరించాలని కోరారు.


Next Story

Most Viewed