పీవీ జీవిత సందేశం ప్రజల్లోకి తీసుకెళ్తాం : ఉత్తమ్

by  |
పీవీ జీవిత సందేశం ప్రజల్లోకి తీసుకెళ్తాం : ఉత్తమ్
X

దిశ, వెబ్ డెస్క్: మాజీ ప్రధాని వీపీ నరసింహారావు శత జయంత్రి సందర్భంగా హైదరాబాద్‌లోని నెక్లెస్ రోడ్‌లోని పీవీ ఘాట్ వద్ద ఏర్పాటు చేసిన ఉత్సవాల్లో టీపీసీసీ ప్రెసిడెంట్ ఉత్తమ్ కుమార్ రెడ్డి నివాళ్లర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ… పీవీ జీవిత సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తామన్నారు. తెలంగాణలోని అణగారిన వర్గాల హృదయాల్లో పీవీ చిరస్థాయిగా నిలిపోతారని అన్నారు. సామాన్య కార్యకర్త నుంచి ప్రధానిగా ఎదిగారని తెలిపారు. ల్యాండ్ సీలింగ్‌‌తో పేదలకు సాయం వ్యక్తి, దేశ ఆర్థిక పరిస్థితిని గాడిన పెట్టిన ఘనత కూడా పీవీదే అన్నారు. కాంగ్రెస్ తరపున కూడా పీవీ శతజయంత్రి వేడుకలు నిర్వహిస్తామని ఉత్తమ్ స్పష్టం చేశారు.


Next Story