దేశంలో మొత్తం కేసులు 17,50,723

by  |
దేశంలో మొత్తం కేసులు 17,50,723
X

దిశ, న్యూస్‌బ్యూరో: దేశంలో కరోనా వ్యాప్తి ఉద్ధృతంగా కొనసాగుతోంది. ఒక్కరోజులో నమోదయ్యే కొత్త కేసులు వరుసగా నాలుగో రోజు 50వేల మార్కు దాటాయి. ఆదివారం ఉదయం కేంద్ర ఆరోగ్యశాఖ బులెటిన్ వెల్లడించే‌సరికి గడిచిన 24 గంటల్లో 54,735 కొత్తకేసులు నమోదయ్యాయి. దీంతో దేశవ్యాప్తంగా ఇప్పటివరకు నమోదైన కేసుల సంఖ్య 17,50 723కు చేరినట్లు ఆరోగ్య శాఖ తెలిపింది. వైరస్ బారిన పడి దేశంలో ఒక్కరోజే 853మంది మరణించారు. దీంతో దేశంలో ఇప్పటివరకు కరోనాతో చనిపోయిన వారి సంఖ్య 37,364కు చేరిందని ఆరోగ్య శాఖ తెలిపింది. ఒక్కరోజులో నమోదైన మరణాల సంఖ్య 800 మార్కు దాటడం ఇదే తొలిసారి. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక కరోనా మరణాలు సంభవించిన దేశాల జాబితాలో భారత్ 5వ స్థానంలో కొనసాగుతోంది.

ఇప్పటివరకు కరోనా సోకిన వారిలో 11లక్షల 45వేల మంది కోలుకోగా ప్రస్తుతం 5లక్షల 67వేల మంది చికిత్స పొందుతున్నారు. మహారాష్ట్ర, తమిళనాడులో కరోనా తీవ్ర స్థాయిలో కొనసాగుతుండగా ఢిల్లీలో మాత్రం గతంతో పోలిస్తే తగ్గుముఖం పడుతోంది. 24 గంటల్లో కొత్తగా నమోదైన 1186 కొత్త కేసులతో కలిపి ఢిల్లీలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 1,36,716కు చేరింది. ఇక్కడ కొత్తగా 15కరోనా మరణాలు నమోదవడంతో ఇప్పటివరకు 4004 మంది వైరస్ బారిన పడి చనిపోయారు. మహారాష్ట్రలో ఒక్క రోజులో 9,509 పాజిటివ్ కేసులు నమోదై మొత్తం కేసుల సంఖ్య 4,41,228కి వెళ్లింది. రాష్ట్రంలో 24గంటల్లో వైరస్ బారినపడి 260 మంది చనిపోగా మొత్తం మరణాలు 15,576కు చేరాయి. తమిళనాడులో 24గంటల్లో 5811 పాజిటివ్‌లు నమోదై మొత్తం కేసుల సంఖ్య 2,57,613కు చేరింది. ఇక్కడ కొత్తగా కరోనాతో 98మంది చనిపోగా మొత్తం మరణాల సంఖ్య 4132కు చేరింది. గుజరాత్‌లో ఇప్పటివరకు 63,675 కేసులకుగాను 2478 మంది మృత్యువాత పడడం రాష్ట్రంలో ఆందోళన కలిగిస్తోంది. ఏపీలో గడిచిన 24గంటల్లో 8,555కేసులు నమోదవడంతో మొత్తం కేసుల సంఖ్య 1,58,764కు చేరింది. ఒక్కరోజే ఏపీలో కరోనాతో 67మంది చనిపోయారు. ఇప్పటివరకు వైరస్ సోకి 1,474 మంది ప్రాణాలు కోల్పోయారు.


Next Story

Most Viewed