వరుసగా తొమ్మిదో రోజు కూడా..

by  |
వరుసగా తొమ్మిదో రోజు కూడా..
X

న్యూఢిల్లీ: రోజురోజుకూ దేశంలో కరోనా వైరస్ తీవ్ర స్థాయిలో విజృంభిస్తోన్నది. దీని కోరలకు చిక్కి ప్రజలు అల్లాడిపోతున్నారు. వరుసగా తొమ్మిదో రోజూ కూడా పదివేలకు పైగా కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో 14,516 కేసులు నమోదయ్యాయి. 375 మంది మృతి చెందారు. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు మొత్తం కరోనా కేసులు సంఖ్య 3,95,048 కు చేరుకుంది. ఇందులో 2,13,831 మంది డిశ్చార్జ్ అయ్యారు. 1,68,269 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు కరోనాతో మృతి చెందినవారి సంఖ్య 12,948 కు పెరిగింది.


Next Story