రేపు, ఎల్లుండి సీఎం సమీక్ష..! టాపిక్స్ ఏంటంటే..?

by  |
రేపు, ఎల్లుండి సీఎం సమీక్ష..! టాపిక్స్ ఏంటంటే..?
X

దిశ, వెబ్ డెస్క్: రేపు, ఎల్లుండి ఇంజినీరింగ్ అధికారులతో సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వంహిచనున్నట్లు సమాచారం. ఈ సమావేశంలో నూతన సచివాలయం నిర్మాణం, నీటి పారుదల శాఖపై చర్చించనున్నట్లు తెలిసింది. ఇందులో భాగంగా రేపు మధ్యాహ్నం 2 గంటలకు నీటిపారుదల శాఖపై, ఎల్లుండి మధ్యాహ్నం 2 గంటలకు ఆర్అండ్ బీ శాఖపై సీఎం కేసీఆర్ సమీక్షించనున్నారు. నీటిపారుదల శాఖ పునర్ వ్యవస్థీకరణ ముసాయిదాపై సమగ్రంగా చర్చించి తుది నిర్ణయం తీసుకోనున్నారు. అదేవిధంగా నూతన సచివాలయ నిర్మాణంపై చర్చించనున్నారు. ఈ సమావేశంలో తమిళనాడుకు చెందిన ఆర్కిటెక్టులు పాల్గొననున్నారు. సచివాలయం బాహ్యరూపం, అందులో సౌకర్యాలపై సుదీర్ఘంగా చర్చించనున్నారు. అనంతరం ఆ నిర్ణయాలను మంత్రివర్గంలో చర్చించి తుది నిర్ణయం తీసుకోనున్నారు. ఆ తర్వాత టెండర్లు పిలిచి నూతన నిర్మాణాన్ని ప్రారంభించనున్నట్లు తెలిసింది.



Next Story

Most Viewed