భారత్‌లో 23 లక్షలు దాటిన కరోనా కేసులు

by  |
భారత్‌లో 23 లక్షలు దాటిన కరోనా కేసులు
X

దిశ, వెబ్ డెస్క్: దేశంలో కరోనా కాకవికలం చేస్తోంది. దాని ప్రభావంతో ప్రజలు అల్లకల్లోలం అవుతున్నారు. గతకొద్ది రోజుల నుంచి ప్రతిరోజూ వేల సంఖ్యలో కొత్త కేసులు నమోదవుతున్నాయి. వందల సంఖ్యలో ప్రజలు కరోనా బారిన పడి మృత్యువాత పడుతున్నారు.

తాజాగా గడిచిన 24 గంటల్లో 60,963 కొత్త కేసులు నమోదయ్యాయి. 834 మంది మృతిచెందారు. దీంతో ఇప్పటివరకు కరోనా సోకి మృతిచెందిన వారి సంఖ్య 23,29,639 కు చేరుకుంది. ఇందులో 16,39,600 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు. 6,43,948 మంది బాధితులు కరోనాతో పోరాడుతున్నారు. అదేవిధంగా ఇప్పటివరకు 46,091 మంది బాధితులు కోరనాతో మృతిచెందారు.


Next Story