వామ్మో.. అంతమంది చనిపోయారా..?

by  |
వామ్మో.. అంతమంది చనిపోయారా..?
X

దిశ, వెబ్ డెస్క్: దేశంలో కరోనా వైరస్ రోజురోజుకు తీవ్ర స్థాయిలో విజృంభిస్తోన్నది. గత కొద్ది రోజుల నుంచి వేల సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. వందల సంఖ్యలో ప్రజల దాని బారిన పడి మృతి చెందుతున్నారు. గడిచిన 24 గంటల్లో దేశంలో 14,933 కేసులు నమోదు కాగా, 312 మంది మృతి చెందారు. దీంతో ఇప్పటివరకు దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 4 లక్షల 40 వేల 215కు చేరుకుంది. ఇందులో లక్షా 78 వేల 14 మంది ఆస్పత్రుల నుంచి డిశ్చార్జయ్యారు. అదేవిధంగా దేశవ్యాప్తంగా ఇప్పటివరకు కరోనా బారిన పడి మృతి చెందిన వారి సంఖ్య 14,011 కు చేరుకుంది.


Next Story

Most Viewed