ఏపీలో 5 లక్షలకు చేరువలో కరోనా

by  |
coronavirus
X

దిశ, వెబ్‌డెస్క్: ఏపీలో కరోనా వైరస్ క్రమేణా విజృంభిస్తోంది. రోజుకీ వేల సంఖ్యల్లోనే కేసులు నమోదు అవుతున్నాయే తప్ప ఏమాత్రం తగ్గడం లేదు. శనివారం రాష్ట్ర వైద్యారోగ్యశాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసేటప్పటికీ.. ఏపీలో కొత్తగా 10,825 కేసులు నమోదు అయ్యాయి. దీంతో ఇప్పటివరకు మొత్తం 4,87,331 కేసులు రికార్డు అయ్యాయి. అలాగే, గత 24 గంటల్లో 71 మరణాలు వెలుగుచూశాయి. దీంతో మరణాల సంఖ్య 4347కు చేరింది. కరోనా నుంచి కోలుకొని మొత్తం 3,82,104 మంది డిశ్చార్జి అయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలో 1,00,830 యాక్టివ్ కేసులు ఉన్నాయని హెల్త్ బులెటిన్ వెల్లడించింది.


Next Story

Most Viewed