మండలి ఛైర్మన్‌ను కలిసిన టీఎన్జీవో నేతలు

by  |
మండలి ఛైర్మన్‌ను కలిసిన టీఎన్జీవో నేతలు
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ శాసనమండలి ఛైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డిని టీఎన్జీవో రాష్ట్ర అధ్యక్షుడు మామిళ్ల రాజేందర్, ప్రధాన కార్యదర్శి రాయకంటి ప్రతాప్‌, కారం రవీందర్‌రెడ్డి, పలువురు సంఘం నేతలు కలిశారు. ఈ సందర్భంగా మామిళ్ల రాజేందర్‌ మాట్లాడుతూ ఉద్యోగుల సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు సాయం చేయాలని మండలి ఛైర్మన్‌ను కోరినట్లు తెలిపారు. గుత్తా సుఖేందర్‌రెడ్డి మాట్లాడుతూ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తనవంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.


Next Story

Most Viewed