నెటిజన్లపై తిరుపతి మున్సిపాలిటీ ఫైర్

by  |
నెటిజన్లపై తిరుపతి మున్సిపాలిటీ ఫైర్
X

దిశ, ఏపీ బ్యూరో: సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్ ప్రచారం చేసే నెటిజన్లపై తిరుపతి మున్సిపాలిటీ అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నెల 29 నుంచి తిరుపతిలో మరోమారు లాక్‌డౌన్ విధించబోతున్నారంటూ సోషల్ మీడియాలో విస్తృతంగా జరుగుతున్న ప్రచారంపై నగరపాలక కమిషనర్ పీఎస్ గిరీశ్ మండిపడ్డారు. సోషల్ మీడియా ప్రచారంలో వాస్తవం లేదని తేల్చి చెప్పారు. తప్పుడు ప్రచారంతో ప్రజలను భయభ్రాంతులకు గురిచేయడం సరికాదని హితవు పలికారు. సోషల్ మీడియాలో ఇలాంటి ప్రచారం చేస్తున్న వారిని గుర్తించాలని తిరుపతి అర్బన్ జిల్లా ఎస్పీ రమేశ్ రెడ్డికి లేఖ రాశారు. నగరంలో మరోమారు లాక్‌డౌన్ అమలు చేసే ఆలోచన ప్రస్తుతానికి లేదని, ప్రజలే అప్రమత్తంగా ఉంటూ కరోనాను కట్టడి చేసే చర్యలు పాటించాలని ఈ సందర్భంగా సూచించారు.


Next Story