- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ ప్రతినిధి, హైదరాబాద్: నగరంలోని జవహర్ లాల్ నెహ్రూ జువాలజికల్ పార్కులో తెలుపు రంగు రాయల్ బెంగాల్ టైగర్ (పులి) కిరణ్ మృతిచెందింది. ప్రస్తుతం దాని వయస్సు ఎనిమిది ఏండ్లు. కుడి దవడ భాగంలో ఏర్పడిన నియోప్లాస్టిక్ కణితి కారణంగా గత కొన్ని రోజులుగా చికిత్స పొందుతూ శుక్రవారం మృతిచెందింది. ఈ విషయాన్ని జూ అధికారులు తెలిపారు. కిరణ్ నెహ్రూ జూలోనే పుట్టి పెరిగిందని వారు వెల్లడించారు. గత నెల 29న పరీక్షలు చేయగా కిరణ్ కుడి దవడలో కణితి ఉన్న విషయం బయటపడిందని, అప్పటి నుంచి శాస్త్రవేత్తలు, వైద్యులు పులికి చికిత్స అందిస్తున్నారని తెలిపారు. కిరణ్ తండ్రి బద్రి కూడా నియో ప్లాస్టిక్ కణితితోనే బాధపడుతూ కొన్నేళ్ల క్రితం మృతి చెందింది. కిరణ్ తాత రుద్ర 12 ఏండ్ల వయసులో ఇదే వ్యాధితో మృతి చెందింది. ఇప్పుడు కిరణ్ కూడా అదే వ్యాధితో మృతి చెందడంతో వైద్యులు శాంపిళ్లు సేకరించి పరీక్షలు నిర్వహిస్తున్నారు. కాగా, జూపార్కుకే వన్నెతెచ్చే రాయల్ బెంగాల్ టైగర్లు ఒకేరకమైన ట్యూమర్ వ్యాధితో మృతిచెందుతుండటంతో ఆందోళనకు గురి చేస్తోందని అధికారులు పేర్కొన్నారు.