పిడుగుపాటుకు భార్యాభర్తల మృతి

by  |
పిడుగుపాటుకు భార్యాభర్తల మృతి
X

దిశ, మహబూబ్ నగర్: పిడుగుపాటుకు గురై భార్యాభర్తలు మృతిచెందిన సంఘటన మహబూబ్‌నగర్ జిల్లాలో చోటుచేసుకుంది. మంగళవారం సాయంత్రం మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంతోపాటు పరిసర ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. పొలం వద్దకు వెళ్లి వస్తున్న మాచన్‌పల్లి తండాకు చెందిన భార్యాభర్తలు భీముల, సరిజలపై పిడుగు పడింది. దీంతో వారు అక్కడికక్కడే మృతిచెందారు. వారికి ఇద్దరు కుమారులు ఉన్నారు. తల్లిదండ్రుల మృతదేహాల వద్ద పిల్లలు విలపించిన తీరు గ్రామస్తులను కల్చివేసింది.

Tags: Mahabubnagar,Thunderbolt,Couple,Death



Next Story