ఘోరప్రమాదం.. ముగ్గురు దుర్మరణం

by  |
ఘోరప్రమాదం.. ముగ్గురు దుర్మరణం
X

దిశ‌, వెబ్‌డెస్క్: ఏపీలో ఘోర ప్రమాదం జరిగింది. చిత్తూరు జిల్లా కేవీపల్లి మండలం గ్యారంపల్లి కస్పా బస్టాండ్ వద్ద శనివారం జాతీయ రహదారిపై బైక్‌ను లారీ ఢీకొనడంతో ముగ్గురు దుర్మరణం చెందారు. మృతులను చిన్నగొట్టిగల్లుకు చెందిన దంపతులు శంకరయ్య, రెడ్డమ్మ, కుమారుడు అఖిల్‌గా గుర్తించారు. పీలేరు నుంచి రాయచోటికి బైక్‌పై వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. స్థానికుల సమాచారం మేరకు ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పీలేరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.



Next Story

Most Viewed