టన్ను తాబేళ్లు స్వాధీనం

by  |
టన్ను తాబేళ్లు స్వాధీనం
X

దిశ, ఏపీ బ్యూరో: ఒడిశాకు అక్రమంగా తరలిస్తున్న తాబేళ్లను పోలీసులు పట్టుకున్నారు. కృష్ణా జిల్లాలోని పలు మండలాల నుంచి తాబేళ్లను సేకరించి ఒడిశాకు తరలిస్తున్నారన్న విశ్వసనీయ సమాచారంతో సానరుద్రవరం వద్ద అడ్డుకున్నారు. శుక్రవారం రాత్రి వాహనాలను తనిఖీలు చేసిన పోలీసులు తాబేళ్లను స్వాధీనం చేసుకొని, వాటిని కైకలూరు అటవీశాఖ అధికారులకు అప్పగించినట్లు తెలిపారు. ముగ్గురిని అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేశారు.


Next Story

Most Viewed