చిల్పకుంట్లలో దొంగల హల్‎చల్..!

by  |
చిల్పకుంట్లలో దొంగల హల్‎చల్..!
X

దిశ, వెబ్‎డెస్క్: సూర్యాపేట జిల్లా నూతనకల్ మండలం చిల్పకుంట్లలో దొంగలు బీభత్సం సృష్టించారు. అర్ధరాత్రి సమయంలో గుర్తు తెలియని దుండగులు ఏడు ఇళ్లలో దొంగతనానికి పాల్పడ్డారు.

వివరాల్లోకి వెళ్తే.. తొట్ల మల్లయ్య తన భార్యపిల్లలతో కలిసి అత్తగారింటికి వెళ్లారు. ఎవరూ లేని సమయంలో దుండగులు ఇంటి తలుపులు పగులగొట్టి అరతులం బంగారం, రూ.5 వేల నగదు దోచుకెళ్లారు. కట్ట నర్సిరెడ్డి ఇంట్లో తులం బంగారం, 15 తులాల వెండి గొలుసులు.., కట్ట నర్సమ్మ ఇంట్లో రూ. 30 వేలు, 15 తులాల వెండి గొలుసులు.. మహేష్ తన ఇంట్లోని కారిడార్‎లో పార్క్ చేసిన బైక్, యాదగిరి ఇంట్లో బైకును ఎత్తుకెళ్లారు. బాధితుల ఫిర్యాదు మేరకు నూతనకల్ ఎస్సై శివకుమార్ ఘటనా స్థలాలను పరిశీలించారు.


Next Story

Most Viewed