పెట్రోల్ బంక్ సిబ్బందిపై దొంగలముఠా దాడి

by  |
పెట్రోల్ బంక్ సిబ్బందిపై దొంగలముఠా దాడి
X

దిశ, బోధన్: నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలోని హెచ్‌పీ పెట్రోల్ బంకులో ఆదివారం రాత్రి గుర్తుతెలియని దుండగులు బీభత్సం సృష్టించారు. పెట్రోల్ బంక్ సిబ్బందిపై ఆరుగురు దొంగలు దాడి చేసి, డబ్బులు లాక్కొని పారిపోయారు. దీంతో వెంటనే స్థానిక పోలీసులకు బంక్ సిబ్బంది సమాచారం అందించారు. కేసు నమోదు చేసుకున్న ఎస్‌ఐ మొగులయ్య దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.


Next Story