నేరేడుచర్లలో దొంగల బీభత్సం..

by  |
నేరేడుచర్లలో దొంగల బీభత్సం..
X

దిశ, వెబ్‌డెస్క్: సూర్యాపేట జిల్లాలో దారుణం చోటుచేసుకుంది.కొందరు దుండగులు ఓ ఇంట్లోకి చోరబడి వృద్దురాలిపై దాడికి పాల్పడ్డారు. అనంతరం ఆమె మెడలోని పుస్తెలతాడును ఎత్తుకెళ్లారు. ఈ ఘటన జిల్లాలోని నేరేడుచర్లలో ఆదివారం వెలుగులోకివచ్చింది.

ఇంట్లో ఎవరూ లేరని సమయం చూసే వృద్దురాలిపై దొంగలు దాడికి చేసినట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని వివరాలు సేకరించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

Read Also…

కిడ్నీ కొంటామంటూ దంపతులకు టోకరా..


Next Story