ఈ ఏడాది నిమజ్జనం ? : గణేష్ ఉత్సవ సమితి

by  |
ఈ ఏడాది నిమజ్జనం ? : గణేష్ ఉత్సవ సమితి
X

దిశ, వెబ్ డెస్క్: ఈ ఏడాది సామూహిక నిమజ్జనం ఉండదని, దశలవారీగా నిమజ్జనం కార్యక్రమం ఉంటదని, ఈ విషయంలో ప్రభుతానికి సహకరించాలని గణేష్ ఉత్సవ సమితి పేర్కొన్నది. వివరాల్లోకి వెళితే.. శనివారం ఉదయం గణేష్ ఉత్సవాల నిర్వహణపై ఉత్సవ సమితితో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, అధికారులు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని మాట్లాడుతూ.. గణేష్ ఉత్సవాల నిర్వహణపై మరోసారి సమావేశమవుతామని పేర్కొన్నారు. కరోనా విజృంభిస్తున్నందున గణేష్ ఉత్సవాలు ఏ విధంగా నిర్వహించాలి అనే అంశంపై తుది నిర్ణయం తీసుకుంటామని మంత్రి చెప్పారు.


Next Story