పాతబస్తీలో దారుణం.. తల్వార్లతో దాడి

by  |
పాతబస్తీలో దారుణం.. తల్వార్లతో దాడి
X

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్ మహానగరంలోని పాతబస్తీ ఏరియాలో బుధవారం భయానక ఘటన చోటుచేసుకుంది. పార్కింగ్ విషయంలో ఇద్దరు వ్యక్తుల మధ్య తలెత్తిన గొడవ పెద్ద వివాదానికి దారితీసింది. ఈ నేపథ్యంలోనే కత్తులు, తల్వార్లు, బండరాళ్లతో ఓ వర్గం మరో వ్యక్తి కుటుంబంపై దాడికి పాల్పడింది.

కుల్సుంపుర పీఎస్ పరిధిలో జరిగిన ఈ ఘటనలో నలుగురు వ్యక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. దుండగుల దాడిలో బాధిత వ్యక్తి ఇంట్లోని వస్తువులన్నీ చెల్లా చెదురయ్యాయి. ఒక్కసారిగా దాడి జరగడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. కాగా, ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


Next Story

Most Viewed