- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, జనగామ : కిరాణా దుకాణంలో సబ్బుల కాటన్లు దొంగిలించిన కేసులో ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు జనగామ సీఐ మల్లేష్ యాదవ్ తెలిపారు. ఆదివారం జనగామ ఠాణాలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఈనెల 10న జిల్లా కేంద్రానికి చెందిన వీరన్న అనే కిరాణా వ్యాపారి గోదాంలో సంతూర్ సబ్బుల కాటన్స్ గుర్తు తెలియని వ్యక్తులు దొంగలించారు. బాధిత వ్యక్తి ఫిర్యాదు మేరకు పోలీసులు వెంటనే సీసీ కెమెరాల ద్వారా నిందితులను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. సబ్బు బాక్స్ల చోరీకి పాల్పడిన వారిలో జనగామకు చెందిన శంకర్, తరిగొప్పుల మండలానికి చెందిన వి. రాజు ఉన్నారని సీఐ తెలిపారు. కాగా, దొంగిలించబడిన సబ్బు కాటన్లను ఓమ్ని వ్యానులో తరలిస్తుండగా పక్కా సమాచారం మేరకు పట్టుకున్నట్లు తెలిపారు. సబ్బు కాటన్ల విలువ రూ.2,30,000 పైన ఉంటుందని పోలీసులు వివరించారు.