ప్రాణం తీసిన ఈత సరదా

by  |
ప్రాణం తీసిన ఈత సరదా
X

దిశ, నర్సంపేట: మహబూబాబాద్‌లో విషాదం చోటుచేసుకుంది. ఈత సరదా ఓ యువకుడి ప్రాణాలు తీసింది. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ సంఘటన మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలంలో శుక్రవారం చోటు చేసుకుంది. వివరాళ్లోకి వెళితే.. కొత్తగూడ మండలం కొర్ర తండాకు చెందిన కొర్ర రాజేందర్, కొర్ర నరేందర్, కెలావత్ వీరన్న, బానోత్ విజయ్ అనే నలుగురు యువకులు కౌల్ నారాయణ కుంటకు చెందిన చెరువులోకి ఈతకు వెళ్లారు. ఈత కొడుతున్న సమయంలో ప్రమాదవశాత్తు నలుగురు నీట మునగారు. ఈ ఘటనలో కొర్ర రాజేందర్ మృతిచెందగా నరేందర్ పరిస్థితి విషమంగా ఉండటంతో నర్సంపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మిగిలిన ఇద్దరు వీరన్న, విజయ్ ప్రాణాలతో బయట పడ్డారు. కుమారుడు చనిపోయాడని తెలిసిన ఆ తల్లిదండ్రల రోదన గ్రామం మొత్తాన్ని కంటనీరు తెప్పించింది. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


Next Story

Most Viewed