లారీ టైర్ తలపైకి ఎక్కి… అక్కడికక్కడే మృతి

by  |
లారీ టైర్ తలపైకి ఎక్కి… అక్కడికక్కడే మృతి
X

దిశ, పాలేరు: ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం తిరుమలాపురం గ్రామ సమీపంలోని చెర్వుమాధారం క్రాస్ రోడ్డు వద్ద లారీ, బైక్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, మరొకరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. వివరాళ్లోకి వెళితే… నేలకొండపల్లి గ్రామానికి చెందిన నాయిని ఉపేందర్, పెద్దపల్లి నరేష్ ద్విచక్ర వాహనంపై కోదాడ వెళుతుండగా తిరుమలాపురం గ్రామ సమీపంలోని చెర్వుమాధారం అడ్డరోడ్డు వద్ద ఎదురుగా వస్తున్న లారీ బై‌క్‌ను ఢీకొట్టింది.

ఈ ప్రమాదంలో ఉపేందర్ తలపై నుంచి లారీ టైర్ ఎక్కింది. దీంతో ఆయన అక్కడికక్కడే మృతిచెందాడు. పెద్దపల్లి నరేష్ పరిస్థితి విషమంగా ఉండటంతో 108 ద్వారా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు. ఈ విషయమై నేలకొండపల్లి ఎస్సై అశోక్ కుమార్ రెడ్డి కేసు నమోదు చేసిన దర్యాప్తు చేస్తున్నారు.


Download Dishadaily Android APP

Download Dishadaily IOS APP



Next Story

Most Viewed