- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, మేడ్చల్: నిరాడంబరంగా బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణ మహోత్సవ వేడుకలను నిర్వహిస్తున్నట్లు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఈ నెల 23వ తేదీన నిర్వహించే ఈ మహోత్సవాన్ని భక్తులు ప్రత్యక్ష ప్రసారం ద్వారా టీవీల్లో చూసేందుకు ఏర్పాట్లు చేసినట్టు మంత్రి తలసాని తెలిపారు. సోమవారం అమ్మవారి కళ్యాణ ఆహ్వానాన్ని మంత్రికి ఆలయ కమిటీ సభ్యులు, అధికారులు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రోజురోజుకూ కరోనా వ్యాప్తి పెరుగుతున్న నేపథ్యంలో నియంత్రణ కోసం ప్రభుత్వ ఆదేశాలకనుగుణంగా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ప్రతిఏడాది లక్షలాది మంది భక్తుల మధ్య అమ్మవారి కళ్యాణాన్ని ఘనంగా నిర్వహిస్తున్నట్టు వివరించారు. ఈ ఏడాది కరోనా మూలంగా ఆలయ అధికారులు, పండితుల సమక్షంలో నిర్వహించడం జరుగుతుందన్నారు. భక్తులు కూడా దీనికి అర్ధం చేసుకుని సహకరించాలని కోరారు.
Next Story