కరోనా సోకిన వ్యక్తి పరార్

by  |
కరోనా సోకిన వ్యక్తి పరార్
X

దిశ,మునుగోడు: యాదాద్రి-భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండల పరిధిలోని పీపల్ పహాడ్ గ్రామానికి చెందిన వ్యక్తికి ఇటీవల కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. ఇతను ఇటీవల నైజీరియా నుండి వచ్చాడు. హైదరాబాద్ లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి గత నెల 25 న శాంపిల్స్ పంపగా 27న కరోనా సోకినట్లుగా నిర్ధారణ అయ్యింది. దీంతో బాధితుడిని చికిత్స నిమిత్తం హైదరాబాద్ లోని గాంధీ ఆసుపత్రికి తరలించగా లక్షణాలు లేవని గాంధీ సిబ్బంది తిప్పి పంపారు. దీంతో బాధితుడిని హోం క్వారంటైన్ చేయగా గ్రామస్తులు బాధితుడిని ఇంట్లో ఉంచి బయట తాళాలు వేసుకున్నారు. కరోనా పరీక్షలు నిర్వహించిన ఆసుపత్రి రిపోర్టులు సరిగా లేవని సదరు ఆసుపత్రిని అధికారులు సీజ్ చేశారు. దీంతో బాధితుడు కూడా నాకు వచ్చిన రిపోర్ట్ తప్పు అనుకోని తాళాలు పగలగొట్టి అర్ధరాత్రి పారిపోయాడు.


Next Story

Most Viewed