- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
వినాయక భక్తులకు భారీ షాక్.. ట్యాంక్ బండ్ లో నిమజ్జనం లేనట్టేనా..?

దిశ, వెబ్ డెస్క్: గణేష్ నిమజ్జనంపై హైకోర్టు ప్రభుత్వానికి కీలక సూచనలు చేసింది. హైదరాబాద్ పరిధిలో ఏర్పాటు చేసిన వినాయకులను స్థానికంగా ఉన్న చెరువులు, కొలనులు, బల్దియా ఏర్పాటు చేసిన నీటి తొట్టెల్లోనో నిమజ్జనం చేసే విధంగా ఆలోచించాలని కోర్టు ప్రభుత్వానికి సూచించింది. హుస్సేన్ సాగర్లో వినాయక విగ్రహాల నిమజ్జనాలు నిషేధించాలన్న పిటిషన్పై తెలంగాణ హైకోర్టులో బుధవారం విచారణ జరిగింది. ఈ సందర్భంగా నిమజ్జనం సమయంలో ప్రభుత్వం తీసుకోనున్న నియంత్రణ చర్యలు, ఆంక్షలను సూచించాలని హైకోర్టు ఆదేశించింది.
కొవిడ్ పరిస్థితులు, కాలుష్యాన్ని దృష్టిలో ఉంచుకొని, ప్రజల సెంటిమెంట్నూ గౌరవిస్తూ చర్యలు తీసుకోవాలని కోరింది. ఎక్కడికక్కడ స్థానికంగానే నిమజ్జనం చేస్తే బాగుంటుందని అభిప్రాయం వ్యక్తం చేసింది. సామూహిక నిమజ్జనంతో హుస్సేన్ సాగర్ దెబ్బతినకుండా చూడాలని, ప్రభుత్వం, గణేష్ ఉత్సవ సమితి, పిటిషనర్ నివేదికలు సమర్పించాలని కోర్టు పేర్కొంది. ఈనెల 6న అందరి సూచనలు పరిగణనలోకి తీసుకొని ఆదేశాలు జారీ చేస్తామని తీర్పునిచ్చింది.