ఎన్​ఆర్​ఏ ఏర్పాటు గొప్ప మలుపు

by  |
ఎన్​ఆర్​ఏ ఏర్పాటు గొప్ప మలుపు
X

దిశ, న్యూస్​బ్యూరో: ప్రభుత్వ ఉద్యోగాల నియామకాల కోసం కేంద్ర ప్రభుత్వం నేషనల్ రిక్రూట్ మెంట్ ఏజెన్సీ (ఎన్ఆర్ఏ) ఏర్పాటు చేయడం గొప్ప మలుపని గవర్నర్​ తమిళిసై సౌందరరాజన్​ అన్నారు. ‘ఇన్నోవేషన్స్ ఫర్ న్యూ నార్మల్’ అంశంపై వర్చువల్​లో జరుగుతున్న అంతర్జాతీయ సెమినార్​లో ఆదివారం ముఖ్య అతిథిగా గవర్నర్ పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గవర్నర్​ మాట్లాడుతూ ఎన్ఆర్ఏ ద్వారా ఏటా 1.35లక్షల కేంద్ర ఉద్యోగాలు భర్తీ అవుతాయని, దాదాపు 2.5 నుంచి 3కోట్ల మంది అభ్యర్ధులు ఈ పరీక్షలకు హాజరవుతారని తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఆన్​లైన్ విద్యకు ఎవరూ దూరం కావద్దని, ఆ దిశగా విద్యాసంస్థలు, విద్యావేత్తలు కృషి చేయాలని తమిళిసై పిలుపునిచ్చారు. గ్రామీణ, గిరిజన ప్రాంతాల్లో ఎక్కువ మంది విద్యార్ధులకు ఇంటర్నెట్, స్మార్ట్​ఫోన్లు అందుబాటులో లేని కారణంగా విద్యకు దూరం కావొద్దని గవర్నర్ అన్నారు. వరంగల్ (రూరల్) జిల్లా పరకాలలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల నిర్వహిస్తున్న ఈ సెమినార్​లో కళాశాల ఎడ్యుకేషన్ కమిషనర్ నవీన్ మిట్టల్, ఐఐఎం ప్రొఫెసర్​ జి.శ్రీనివాస్, వెస్టర్న్ సిడ్నీ యూనివర్సిటీ ప్రొఫెసర్​ గిరిజా శంకర్ పాల్గొన్నారు


Next Story

Most Viewed