- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, న్యూస్బ్యూరో: భారత్ బయోటెక్ నిర్వహిస్తున్న కరోనా వ్యాక్సిన్ తొలి దశ తొలి డోస్ క్లినికల్ ట్రయల్స్ ప్రక్రియ విజయవంతంగా పూర్తయిందని, త్వరలో రెండో డోస్ ప్రక్రియ ప్రారంభం కానుందని ఆసుపత్రి డాక్టర్ శ్రీనివాస్ తెలిపారు. తొలి డోస్ను యాభై మంది వాలంటీర్ల మీద ప్రయోగించామని, వీరంతా క్షేమంగా ఉన్నారని, ఎలాంటి సైడ్ ఎఫెక్టులుగానీ, రియాక్షన్ గానీ రాలేదని ఆయన ‘దిశ’కు వివరించారు. మొత్తం అరవై మందిపై తొలి డోస్ ప్రయోగాలు జరగాల్సి ఉందని, కానీ యాభై మందిపైనే ప్రయోగించామని, కొన్ని కారణాలతో పది మంది వాలంటీర్లపై జరగలేదని తెలిపారు. నాలుగైదు రోజుల్లో ఆ పదిమందిపైనా ప్రయోగిస్తామని తెలిపారు. వీరి ఆరోగ్య స్థితిగతులు కూడా తెలుసుకున్న తర్వాత రెండో డోస్ ప్రయోగానికి సిద్ధం కానున్నట్లు తెలిపారు. ‘నిమ్స్’లోని ఫార్మకాలజీ, ఆనెస్థీషియా, జనరల్ మెడిసిన్ తదితర విభాగాల నిపుణులైన డాక్టర్ల సమక్షంలో క్లినికల్ ట్రయల్స్ జరుగుతున్నట్లు ఆయన తెలిపారు.
తొలుత అనుకున్నట్లుగా షెడ్యూలు ప్రకారం ట్రయల్స్ జరగడంలేదని, కానీ దేశంలో జరుగుతున్న ప్రయోగాలతో పోలిస్తే ‘నిమ్స్’లోనే తొందరగా జరుగుతున్నాయని, దేశం మొత్తం మీద 12 నగరాల్లో ఇవి జరుగుతున్నాయని, హైదరాబాద్ ముందు వరుసలో ఉందని తెలిపారు. రెండో డోస్ ప్రక్రియ ప్రారంభంపై నిర్దిష్ట తేదీని చెప్పలేంగానీ ఈ నెలాఖరుకల్లా మొదలవుతుందని తెలిపారు.