గదిలోకి వెళ్లి… తలుపులు వేసుకున్న కార్పొరేటర్

by  |
గదిలోకి వెళ్లి… తలుపులు వేసుకున్న కార్పొరేటర్
X

దిశ ప్ర‌తినిధి, ఖ‌మ్మం: ఆనంద్ అనే యువ‌కుడి మృతికి కార‌ణ‌మ‌య్యాడ‌‌ని, ఆరోపిస్తూ కైకొండాయిగూడెం గ్రామ‌స్తులు మంగ‌ళ‌వారం ఖ‌మ్మం ఒకటవ డివిజ‌న్ కార్పొరేట‌ర్ రామ్మూర్తి నాయ‌క్‌పై దాడికి పాల్ప‌డ్డారు. రామ్మూర్తినాయ‌క్‌పై ముందు వాగ్వాదం చేసిన గ్రామస్తులు ఒక్క‌సారిగా అతనిపై దాడికి దిగారు.

ప్రాణ‌భ‌యంతో కార్పొరేట‌ర్ స్థానిక ప్ర‌భుత్వ పాఠ‌శాల గ‌దిలోకి వెళ్లి త‌లుపులు వేసుకున్నాడు. అతని కారు అద్దాలు ధ్వంసం చేశారు. బ‌య‌ట‌కు రాకుంటే చంపేస్తామంటూ హెచ్చ‌రించారు. ఈలోపు స‌మ‌చారం అందుకున్న పోలీసులు పాఠ‌శాల వ‌ద్ద‌కు చేరుకున్నారు. ప‌రిస్థితి ఉద్రిక్తంగా మారుతుండ‌గా గ్రామ‌స్తులను శాంతింప‌జేసే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. ఇంకా ఉద్రిక్త ప‌రిస్థితులే కొన‌సాగుతున్నాయి.


Next Story

Most Viewed