- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, మేడ్చల్: కరోనా మూలంగా వాయిదా పడిన పదో తరగతి పరీక్షలు.. జూన్ 8వ తేదీ నుంచి నిర్వహిస్తున్న రాష్ర్ట విద్యాశాఖ వెల్లడించిన విషయం తెలిసిందే. కాగా పరీక్షలను సమర్థవంతంగా నిర్వహించాలని మేడ్చల్ కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో జిల్లా హై పవర్ కమిటీ సమావేశమై అన్ని శాఖల ఉన్నతాధికారులకు టెన్త్ పరీక్షల నిర్వహణపై కలెక్టర్ పలు సూచనలు చేశారు. విద్యార్థులందరూ సామాజిక దూరం పాటించేలా పరీక్షల నిర్వహణ చేపట్టాలన్నారు. పరీక్ష కేంద్రాల వద్ద మాస్కులు, శానిటైజర్లు, క్రీమి సంహాకర మందులు, గ్లౌజులు అందుబాటులో ఉంచాలన్నారు. పరీక్ష కేంద్రాలకు చేరుకునేందుకు విద్యార్థులకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడపాలని సూచించారు. జిల్లాలో 377 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్టు, 44,839 విద్యార్థులు పరీక్షలకు హాజరవుతున్నట్టు కలెక్టర్ తెలిపారు.