ఆ ఆరు మండలాల ఎమ్మార్వోల బదిలీ

by  |

దిశ‌, ఖ‌మ్మం : భ‌ద్రాద్రి కొత్త‌గూడెం జిల్లాలోని ఆరు మండ‌లాల త‌హ‌సీల్దార్ల‌కు స్థానం చ‌ల‌నం క‌లిగింది. ఈ మేర‌కు క‌లెక్ట‌ర్ ఎంవీరెడ్డి బుధ‌వారం సాయంత్రం బ‌దిలీ ఉత్త‌ర్వులను జారీ చేశారు. టేకుల‌ప‌ల్లి త‌హ‌సీల్దార్‌గా ప‌నిచేస్తున్న అశోక‌ చ‌క్ర‌వ‌ర్తిని క‌లెక్ట‌రేట్ డి సెక్ష‌న్ సూప‌రిటెండెంట్ అధికారిగా నియ‌మించారు. అలాగే కొత్త‌గూడెం డీఆర్వోగా అద‌నపు బాధ్య‌త‌లను కూడా అప్ప‌గించారు. దుమ్ముగూడెం త‌హ‌సీల్దార్‌గా ప‌నిచేస్తున్న శ్రీ కె.వీ.శ్రీనివాస‌రావును టేకుల‌ప‌ల్లి త‌హ‌సీల్దార్‌గా బ‌దిలీ చేశారు. దుమ్మ‌గూడెంలో న‌యాబ్ త‌హ‌సీల్దార్‌గా విధులు నిర్వ‌హిస్తున్న రామ్ న‌రేష్‌కు ఇన్‌చార్జి త‌హ‌సీల్దార్‌గా అద‌న‌పు బాధ్య‌త‌లు అప్ప‌గించారు. చ‌ర్ల‌లో త‌హ‌సీల్దార్‌గా ప‌నిచేస్తున్న బి.గ‌న్యాను క‌లెక్ట‌రేట్‌లోని ఈ సెక్ష‌న్ సూప‌రింటెండెంట్‎గా బ‌దిలీ చేశారు. అలాగే ఎల్-ఏ విభాగానికి అధికారిగా అద‌నపు బాధ్య‌తలు అప్ప‌గించారు. క‌లెక్ట‌రేట్‌లో ఏవో (ఎల్ఆర్‌)గా ప‌నిచేస్తున్న రాజేంద్ర‌ను చ‌ర్ల త‌హ‌సీల్దార్‌గా నియ‌మించారు. ఆళ్లంప‌ల్లి త‌హ‌సీల్దార్‌గా ప‌నిచేస్తున్న సురేష్‌ను ముల్క‌ల‌ప‌ల్లి కార్యాల‌యానికి బ‌దిలీ చేశారు. క‌లెక్ట‌రేట్ త‌హ‌సీల్దార్‌గా ఉన్న టి. శివ‌య్య‌ను ఆళంప‌ల్లి త‌హ‌సీల్దార్‌గా బ‌దిలీ చేశారు.

Tags: collector MV reddy, Ruling, mro, transfers, Six zones, Bhadradri kothagudem


Next Story