- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ ప్రతినిధి, ఆదిలాబాద్: జిల్లాలో చేపట్టిన రైతు వేదికల నిర్మాణ పనులను వెంటనే పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ముషర్రఫ్ ఫారూఖీ అధికారులను ఆదేశించారు. గురువారం సాయంత్రం కలెక్టరేట్లో రైతు వేదికల నిర్మాణ పనులపై సంబంధిత అధికారులతో కలెక్టర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. మండల, గ్రామాల వారీగా నిర్మాణ పనుల పురోగతిని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ…
జిల్లాలో చేపట్టిన రైతు వేదికల నిర్మాణ పనులు వేగవంతం చేసి వెంటనే పూర్తి చేసేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. జిల్లాకు మంజూరైన 79 రైతు వేదికల నిర్మాణాలను దసరా నాటికి పూర్తి చేయాలని సూచించారు. సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనుల పురోగతిని ప్రతిరోజూ పర్యవేక్షించాలని, ఇసుక, సిమెంట్, రాడ్ ఇతర సామాగ్రిని అందుబాటులో ఉంచుకోవాలని తెలిపారు. రైతు వేదికల ప్రాంగణంలో ఆహ్లాదవాతావరణం కనిపించేలా విభిన్న ఆకృతులకు ప్రాధాన్యతనిస్తూ పచ్చదనం పెంపొందేలా విరివిగా మొక్కలు నాటాలన్నారు. పనుల్లో నిర్లక్ష్యం వహిస్తున్న అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.