కానిస్టేబుల్‌ను ఢీ కొట్టిన బస్సు..

by Shyam |

బైక్‌పై వెళ్తున్న కానిస్టేబుల్‌ను బస్సు ఢీ కొట్టింది. ఈ ఘటన వరంగల్ రూరల్ జిల్లా నర్సంపేట మండలం లక్నేపల్లి శివారులో బుధవారం జరిగింది. వివరాళ్లోకి వెళితే.. లక్నేపల్లి శివారులోని బాలాజీ ఇంజినీరింగ్ కళాశాల సమీపంలో బైక్ వెళ్తున్న ఏఆర్ కానిస్టేబుల్‌ను జయముఖి ఇంజినీరింగ్ కళాశాల బస్సు ఢీ కొట్టింది. దీంతో కానిస్టేబుల్‌కు తీవ్రంగా గాయాలయ్యాయి. స్థానికులు గమనించి ఆయన్ను ఆస్పత్రికి తరలించారు.


Advertisement
Next Story

Most Viewed