టీడీపీ కార్యకర్త దారుణ హత్య

by  |
టీడీపీ కార్యకర్త దారుణ హత్య
X

దిశ, అమరావతి బ్యూరో: గుంటూరు జిల్లా గురజాల మండల పరిధిలోని అంబాపురంలో విక్రమ్ అనే టీడీపీ కార్యకర్త దారుణ హత్యకు గురయ్యాడు. విక్రమ్‌తో పాటు బైక్ పై ముగ్గురు అర్థరాత్రి వెళ్తుండగా కాపు కాసిన వైసీపీ వర్గీయులు మూకుమ్మడిగా దాడి చేసి వెంటాడి నరికి చంపారు. ఈ దాడిలో విక్రమ్ అక్కడికక్కడే మృతి చెందాడు. మిగిలిన ఇద్దరు తీవ్ర గాయాలతో తప్పించుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన ఇద్దరినీ స్థానిక ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసిన పోలీసుల దర్యాప్తు చేస్తున్నారు. పాత కక్షలే ఈ గలాటకు గల కారణమని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.


Next Story

Most Viewed