బావిలో అప్పుడే పుట్టిన పసికందు మృతదేహం..!

by  |
బావిలో అప్పుడే పుట్టిన పసికందు మృతదేహం..!
X

దిశ, జగిత్యాల: అప్పుడే పుట్టిన నవజాత శిశువును తాగునీటి బావిలో పడేశారు గుర్తు తెలియని వ్యక్తులు. ఈ ఘటన జగిత్యాల జిల్లా మల్యాల మండలం తాటిపల్లిలో చోటు చేసుకుంది. తాగునీటి బావిలో పసికందు మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు.. పోలీసులకు సమాచారం అందించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. గ్రామంలో గర్భవతులు ఎవరున్నారు. ఎక్కడ ప్రసవం జరిగిందనే కోణంలో విచారణ చేపట్టారు.



Next Story

Most Viewed