ఆ వాగులో అన్నాదమ్ములు గల్లంతు.. ఒకరి మృతదేహం లభ్యం

by  |
ఆ వాగులో అన్నాదమ్ములు గల్లంతు.. ఒకరి మృతదేహం లభ్యం
X

దిశ, ములుగు: రెండు తెలుగు రాష్ట్రాల్లో గతకొన్ని రోజులుగా ఎడతెరిపిలేకుండా వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ వర్షాల మూలంగా వాగులు, చెరువులు, నిండి పోవడమే కాకుండా, విపరీతంగా వరదలు పెరిగి ప్రమాదానికి దారి తీస్తున్నాయి. తాజాగా ఈ వరదల్లో పడి ఇద్దరు అన్నదమ్ములు గల్లంతైన విషయమూ తెలిసిందే.

దీనిపై నిన్నటినుంచి రెస్క్యూ టీంలు గాలింపు చర్యలు చేట్టారు. కాగా శుక్రవారం ఇద్దరిలో ఒకరు(శివాజీ) మృతదేహం లభ్యం అయినట్టు స్థానిక అధికారులు తెలిపారు. దీంతో మృతదేహాన్ని స్థానిక ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన ములుగు జిల్లాలోని మేడివాగులో చోటుచేసుకుంది.


Next Story

Most Viewed