విమ్స్ ఆస్పత్రి వద్ద ఉద్రిక్తత

by  |
విమ్స్ ఆస్పత్రి వద్ద ఉద్రిక్తత
X

దిశ, వెబ్ డెస్క్: విశాఖలోని విమ్స్ ఆసుపత్రి వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సోమవారం ఆస్పత్రిని సందర్శించేందుకు మంత్రి అవంతి శ్రీనివాస్ వచ్చారు. ఈ నేపథ్యంలో ఆయనను కరోనా పేషెంట్ల బంధువులు అడ్డుకున్నారు. ఆస్పత్రిలో సరైన వైద్యం అందించడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. చనిపోయినా కూడా సమాచారం ఇవ్వడంలేదని మండిపడ్డారు. వైద్య సిబ్బంది లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని నిరసన వ్యక్తం చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.


Next Story

Most Viewed