- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
భారీగా పెండింగ్లో ఇంటిపన్ను.. యజమానికి షాకిచ్చిన మున్సిపల్ అధికారులు
by Javid Pasha |

X
దిశ, జగిత్యాల టౌన్ : మున్సిపల్ ఇంటి పన్ను కట్టలేదని మున్సిపల్ కార్మికులు ఇంటి ముందే ట్రాక్టర్లో చెత్త వేశారు. ఈ ఘటన జగిత్యాల పట్టణంలోని పురాణి పెట్లో హైమద్ బిన్ సాలెంలో చోటు చేసుకుంది. గత కొన్ని నెలలుగా ఎన్ని సార్లు ఇంటి పన్ను కట్టమని మున్సిపల్ అధికారులు చెప్పినా వినకపోవడంతో మున్సిపల్ కార్మికులు అధికారుల ఆదేశాల మేరకు ఇంటి ముందు చెత్త పోశారు. దీంతో మున్సిపల్ కార్మికులను ఇంటి యజమాని నిలదీశాడు. సమాచారం తెలుసుకున్న మున్సిపల్ అధికారులు ఘటనా స్థలానికి చేరుకోగా..అధికారులు, ఇంటి యజమానులు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. తాను కట్టాల్సిన రూ. 25 వేల రూపాయలు మొత్తాన్ని అధికారులు లక్షకుపైగా చెప్తున్నారని ఇంటి యజమాని వాపోతున్నాడు.
Next Story