Jitender Reddy: వచ్చేస్తున్న ‘జితేందర్ రెడ్డి’.. పోస్ట్ పోన్ అయిన ఐదు నెలల తర్వాత ప్రేక్షకుల ముందుకు

by sudharani |
Jitender Reddy: వచ్చేస్తున్న ‘జితేందర్ రెడ్డి’.. పోస్ట్ పోన్ అయిన ఐదు నెలల తర్వాత ప్రేక్షకుల ముందుకు
X

దిశ, సినిమా: ‘ఉయ్యాల జంపాల’, ‘మజ్ను’ వంటి చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న డైరెక్టర్ విరించి వర్మ (Virinchi Verma) కొత్త సినిమా ‘జితేందర్ రెడ్డి’ (Jitender Reddy). పొలిటికల్ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందిన ఈ మూవీని ముదుగంటి క్రియేషన్స్ పతాకంపై ముదుగంటి వరీందర్ రెడ్డి నిర్మిస్తుండగా.. ‘బాహుబలి’ (Bahubali) ఫేమ్ రాకేష్ వర్రె (Rakesh Varre) ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు. 1980 దశకంలో ఓ వ్యక్తి జీవితంలో జరిగిన వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈ మూవీ మే నెలలోనే రిలీజ్ కావాల్సి ఉండగా.. కొన్ని అనివార్య కారణాల చేత పోస్ట్ పోన్ అయింది. ఇక ఇన్ని నెలల తర్వాత ఈ చిత్రం రిలీజ్‌కు సిద్ధం అయింది. నవంబర్ 8న ‘జితేందర్ రెడ్డి’ (Jitender Reddy) ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు అఫీషియల్ (Official) గా అనౌన్స్ చేస్తూ.. ఓ పోస్టర్‌ను రిలీజ్ చేశారు చిత్ర బృందం.

Advertisement

Next Story