మూడేళ్లుగా నమ్మించి మోసం చేశాడు.. న్యాయం కావాలంటున్న నటి

by Disha Web |
మూడేళ్లుగా నమ్మించి మోసం చేశాడు.. న్యాయం కావాలంటున్న నటి
X

దిశ, సినిమా: బాలీవుడ్ నటి 'రిమీ ‌సేన్‌' పోలీసులను ఆశ్రయించింది. ఓ వ్యక్తి తనను దారుణంగా మోసం చేశాడని వాపోయింది. గోరేగావ్‌కు చెందిన 'రౌనక్ జతిన్ వ్యాస్' అనే వ్యాపారితో మూడేళ్ల క్రితం జిమ్‌లో జరిగిన పరిచయం చాలా తక్కువ సమయంలో క్లోజ్ అయ్యేలా చేసిందని తెలిపింది. ఇదే అవకాశంగా భావించిన వ్యాస్.. తన కొత్త వెంచర్‌లో పెట్టుబడి పెట్టమని మాయమాటలు చెప్పి రూ. 4.14 కోట్లు వసూలు చేశాడని చెప్పింది.

అయితే మూడేళ్లు గడుస్తున్నా కంపెనీని ప్రారంభించలేదని, డబ్బులు తిరిగి ఇవ్వమంటే బెదిరించేందుకు ప్రయత్నిస్తున్నాడని ముంబైలోని ఖర్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసింది. దీంతో వెంటనే స్పందించిన అధికారులు వ్యాస్‌పై IPC 420, 409 సెక్షన్‌ల కింద కేసు నమోదు చేశారు. ఇక 'బిగ్ బాస్ 9' సీజన్‌లో పాల్గొన్న రిమీ సేన్.. నిర్వాహకులు తనకు 35 రోజుల్లో రూ. 2.5 కోట్లు చెల్లించారని అప్పట్లో సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.




Next Story