JEEలో మనోళ్లు అదరగొట్టేశారు..

by  |
JEEలో మనోళ్లు అదరగొట్టేశారు..
X

దిశ, వెబ్‌డెస్క్: JEE మెయిన్స్ పరీక్షా ఫలితాల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు అదరగొట్టేశారు. మెయిన్స్‌లో కేవలం 24 మందికి మాత్రమే వందశాతం మార్కులు సాధించగా అందులో 11 మంది తెలుగు తేజాలే ఉండటం గర్వించదగ్గ విషయం.

వీరిలో తెలంగాణ నుంచి కౌశల్, తనూజ, లిఖిత్ రెడ్డి, శశాంక్, అనిరుధ్, అరుణ్, సిద్ధార్థ్, శివకృష్ణ, వాడపల్లి అర్వింద్ ఉండగా.. ఏపీ నుంచి జితేంద్ర, విష్ణు, నరసింహనాయుడు ఈ జాబితాలో ఉన్నారు. ఇదిలాఉండగా, JEE అడ్వాన్స్‌డ్ కోసం నేటి నుంచి ఈ నెల 17వరకు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు.



Next Story