- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
Home > Telangana Assembly Election 2023 > ఎంపీపై హత్యాయత్నం ఎఫెక్ట్: రాష్ట్ర పోలీసు శాఖ సంచలన నిర్ణయం
ఎంపీపై హత్యాయత్నం ఎఫెక్ట్: రాష్ట్ర పోలీసు శాఖ సంచలన నిర్ణయం
by GSrikanth |

X
దిశ, తెలంగాణ క్రైం బ్యూరో: అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచిన బీఆర్ఎస్ అభ్యర్థులతో పాటు ఆ పార్టీకి చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలకు భద్రతను పెంచుతూ పోలీసు శాఖ నిర్ణయం తీసుకుంది. దుబ్బాక స్థానానికి బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డిపై ఓ వ్యక్తి కత్తితో దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో బీఆర్ఎస్పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీలు, పోటీలో ఉన్న అభ్యర్థులకు వెంటనే భద్రతను పెంచాలంటూ అదనపు డీజీపీ (ఇంటెలిజెన్స్) అన్ని కమిషనరేట్ల కమిషనర్లు, జిల్లాల ఎస్పీలకు ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం ఉన్న టూ ప్లస్టూ భద్రతను ఫోర్ప్లస్ఫోర్కు పెంచాలని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అదేవిధంగా త్రీ ప్లస్త్రీ ఉన్న భద్రతను ఫోర్ప్లస్ ఫోర్కు పెంచాలని సూచించారు.
Next Story