ఇప్పుడు వేసే ఓటుతో గూబ గుయ్యిమనాలి

by Disha Web Desk 15 |
ఇప్పుడు వేసే ఓటుతో గూబ గుయ్యిమనాలి
X

దిశ, హనుమకొండ టౌన్ : ఇప్పుడు వేసే ఓటుతో గూబ గుయ్యిమనాలి అని, నిండు మనసుతో ఆశీర్వదించండి అని కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి డాక్టర్ కడియం కావ్య అన్నారు. మడికొండ ఆర్ ఎన్ ఆర్ గార్డెన్స్ లో శనివారం నిర్వహించిన వర్దన్నపేట నియోజకవర్గం కాజీపేట మండల బూత్ కమిటీ, మండల విస్తృత స్థాయి సమావేశంలో వర్దన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు , డీసీసీ వరంగల్ జిల్లా అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ తో కలిసి వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డాక్టర్ కడియం కావ్య పాల్గొన్నారు. అనంతరం డాక్టర్ కడియం కావ్య మాట్లాడుతూ.. డంపింగ్ యార్డ్ సమస్య పరిష్కారానికి కృషి చేస్తా అని, ఇందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రయత్నాలు చేస్తున్నారు అని అన్నారు. వరంగల్ నగరంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ఏర్పాటుతో పాటు ఇండస్ట్రీయల్ కారిడార్ ఏర్పాటుకు కృషి చేస్తా అని, విద్యా,

ఉద్యోగ, ఉపాధి రంగాలలో వరంగల్ నగరాన్ని ఎడ్యూకేషన్ హబ్ గా, ఐటీ హాబ్ గా, ఇండస్ట్రీయల్ హాబ్ గా తీర్చిదిద్దుతా అని అన్నారు. మీరు నిండు మనసుతో ఆశీర్వదిస్తే హైదరాబాద్ కు దీటుగా వరంగల్ నగర అభివృద్ధికి పాటు పడుతా అని, రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి అంటే కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాల్సిన అవసరం ఉంది అన్నారు. బీజేపీ నుండి దేశానికి విముక్తి కల్పించాలంటే రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కుతోనే సాధ్యం అవుతుంది అని, రాజ్యాంగం కల్పించిన హక్కులతోనే మనం ఇంత స్వేచ్ఛగా బతకగలుగుతున్నాం అన్నారు. అలాంటి రాజ్యాంగాన్ని మార్చాలని, రిజర్వేషన్లను రద్దు చేయాలని చూస్తున్న బీజేపీనీ తరిమికొట్టాలి అని, ఇన్ని రోజులు జరిగింది ఒక ఎత్తు, రానున్న వారం రోజులు జరిగేది మరో ఎత్తు అని అన్నారు. ఇప్పుడు వేసే ఓటుతో గూబ గుయ్యిమనాలి అని, మీ ఇంటి బిడ్డగా నన్ను ఆశీర్వదించాలి అన్నారు. మే 13న జరిగే పార్లమెంట్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలి అని కోరారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ మార్నెని రవీందర్ రావు, దొమ్మటి సాంబయ్య, మండల పార్టీ అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి, మండల ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed