ఆర్థిక పునరావాస పథకం దరఖాస్తుల గడువు పొడిగింపు....ఎప్పటి వరకో తెలుసా

by Sridhar Babu |
ఆర్థిక పునరావాస పథకం దరఖాస్తుల గడువు పొడిగింపు....ఎప్పటి వరకో తెలుసా
X

దిశ,మహబూబాబాద్ టౌన్ : దివ్యాంగులకు 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను ఆర్థిక పునరావాస పథకం (ఎకనామికల్​ రిహబిలిటేషన్ స్కీం) ద్వారా జీవనోపాధి, స్వయం ఉపాధి, కుటీర పరిశ్రమలు పెట్టుకునేందుకు మహబూబాబాద్ జిల్లా నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. 100 శాతం రాయితీతో రూ.50 వేల చొప్పున మొత్తం 21 యూనిట్లకు దరఖాస్తులు కోరుతున్నారు. అర్హులైన దివ్యాంగులు tsobmms.cgg.gov.in వెబ్ సైట్ లో దరఖాస్తు చేసుకోవాలని జిల్లా సంక్షేమ అధికారి ఎం. ధనమ్మ తెలిపారు. దరఖాస్తు తేదీని 02.02.2025 నుండి 12-02-2025 వరకు పొడిగించినట్టు చెప్పారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.


Next Story

Most Viewed