తెలంగాణలో చివరి ఓసీ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డే: తీన్మార్ మల్లన్న

by Mahesh |
తెలంగాణలో చివరి ఓసీ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డే: తీన్మార్ మల్లన్న
X

దిశ, వెబ్‌డెస్క్: ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్లగొండ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న కీలక వ్యాఖ్యలు చేసి మరోసారి వార్తల్లో నిలిచాడు. బీసీ వాదంపై ఉద్యమం చేస్తున్న ఆయన మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తే.. తనకు కేవలం బీసీలు మాత్రమే ఓట్లు వేయాలని, రెడ్లు, ఓసీలు తనకు ఓట్లు చేయొద్దంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. అలాగే తనకు పార్టీ పదవులు లెక్క కాదని, అతి త్వరలో తెలంగాణ రాష్ట్రంలో బీసీల ఉద్యమ భూకంపం రాబోతుందని అన్నారు. అలాగే ఈ రాష్ట్రంలో బీసీలు ఓట్లు వేయకపోతే ఒక్కరు కూడా గెలవరని,, తెలంగాణలో చివరి ఓసీ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డే అంటూ వ్యాఖ్యానించారు. అలాగే బీజేపీ నేత ఈటల బీసీల కోసం స్టేట్‌మెంట్‌ ఇవ్వలేరని గుర్తు చేశారు. దీంతో పాటుగా.. రాబోయే రోజుల్లో కాంగ్రెస్‌ పార్టీ బీసీలదనని, 2028లో బీసీనే తెలంగాణ ముఖ్యమంత్రి అవుతాడని.. ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న చెప్పుకొచ్చారు.

Advertisement

Next Story

Most Viewed