ప్రశాంతంగా ముగిసిన యూజీసీ నెట్ పరీక్ష…

by Kalyani |
ప్రశాంతంగా ముగిసిన యూజీసీ నెట్ పరీక్ష…
X

దిశ, ఆమనగల్లు: దేశవ్యాప్తంగా మంగళవారం జరిగిన యూజీసీ నెట్ పరీక్ష కడ్తాల్ మండలంలో ప్రశాంతంగా ముగిసింది. కడ్తాల్ మండలం ఫార్చ్యూన్ బట్టర్ ఫ్లై స్కూల్ లో ఉదయం జరిగిన సెషన్ 1 లో 276 మంది విద్యార్థులకు 182 మంది, సెషన్ 2 లో 600 మందికి విద్యార్థులకు 478 మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారని ఎగ్జామ్ సెంటర్ సూపరిండెంట్ రంగారావు తెలిపారు. పరీక్ష కేంద్రం దగ్గర ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. పరీక్ష కేంద్రం వద్ద విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని రకాల సదుపాయాలు కల్పించారు. సెంటర్ అబ్జర్వర్ అనిల్, సుజాత, డిప్యూటీ అబ్జర్వర్ సత్యనారాయణ, డిప్యూటీ సెంటర్ సూపరిండెంట్ భుజంగరావు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు సంజీవ్ నాంపల్లి పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed