- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
జల్ పల్లిలో విషాదం … చేపల వేటకు వెళ్లి ఇద్దరు విద్యార్థులు గల్లంతు
దిశ, బడంగ్ పేట్ : జల్ పల్లి పెద్ద చెరువులో చేపల వేటకు వెళ్లిన ఐదుగురు స్నేహితుల్లో ఇద్దరు విద్యార్థులు గల్లంతయిన ఘటన పహాడి షరీఫ్ పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగు చూసింది. పహాడి షరీఫ్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... ఎర్రకుంట కు చెందిన ఉస్మాన్ నాది (13), అబ్దుల్ వాహద్ (14) తో పాటు మరో ముగ్గురు స్నేహితులు ప్రతి ఆదివారం జల్ పల్లి పెద్ద చెరువులో చేపల వేటకు వెళ్లే వారు.
ఈ నేపథ్యంలోనే ఈ ఐదుగురు స్నేహితులు ఆదివారం మధ్యాహ్నం కూడా మరోమారు చేపలు పట్టడానికి జల్ పల్లి పెద్ద చెరువులోకి దిగారు. ఉస్మాన్ నాది, అబ్దుల్ వాహద్ లు ఈత రాక చెరువులో నీట మునిగి గల్లంతయ్యారు. రెప్ప పాటులో జరిగిన సంఘటన చూసి మిగతా ముగ్గురు స్నేహితులు ఆందోళన చెందారు. గట్టిగా కేకలు వేసినప్పటికీ ప్రయోజనం లేకుండా పోయింది. దీంతో ఉస్మాన్ నాది, అబ్దుల్ వాహద్ లు గల్లంతయ్యారు. వారి జాడ కోసం పోలీసులు గజ ఈతగాళ్లను రంగంలోకి దింపి నప్పటికీ ప్రయోజనం లేకుండా పోయింది. ఈ కేసును పహాడి షరీఫ్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.